ఏపీలో రైతులు ఒక్కొక్కరికి రూ.20వేలు! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!
Sat Feb 01, 2025 07:54 Politicsఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెబుతోంది. తెలుగు దేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటూ కీలక అంశాలపై చర్చించారు. మేనిఫెస్టోలో ప్రతి హామీని ప్రస్తావిస్తూ అమలు చేసినవి ఏవి, అమలు చేయాల్సినవి ఏవి అని చర్చించారు. మిగిలిన హామీను ఎప్పటికి అమలు చేయాలో కూడా సమీక్ష చేశారు. జూన్లోగా మిగిలిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని.. అందుకే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని పొలిట్బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా జూన్లోగా సూపర్-6లోని మిగతా మూడు హామీల అమలు చేస్తామంటున్నారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మే నెలలో తల్లికి వందనం పథకం.. కేంద్రంతో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవ కింద మూడు దఫాలుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని కూడా పొలిట్బ్యూరోలో చర్చించారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుంచే, రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే రైతులకు అన్నదాత-సుఖీభవ కింద రూ.20 వేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వేట నిషేధ సమయంలో, ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు రూ.20 వేలు ఇస్తాం. చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటుగా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతాం. అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే ఒక పరిష్కారం కోసం చూస్తున్నాం. ఏ భూములు అయితే అగ్రిగోల్డ్ వి ఉన్నాయో, అవే భూమి రూపంలో బాధితులకు పరిహారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని పై మరింత చర్చ చేసి, నిర్ణయం తీసుకుంటాం'అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలని టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు అర్జీలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇకపై అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి శనివారం ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా శనివారం మాత్రమే వినతుల స్వీకరణ ఉంటుంది.. మంత్రులు అందుబాటులో ఉంటారు.
మిగిలిన రోజుల్లో వినతులు ఇవ్వడానికి వచ్చేవారి కోసం ప్రత్యేక డెస్క్, డ్రాప్ బాక్స్లు ఏర్పాటు చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఏడాదిలోగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలి. రాష్ట్రంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాను విభజించి, పోలవరం విలీన మండలాల్ని కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో.. రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిట్బ్యూరోలో నిర్ణయించారు. మిగిలిన కేసులపైనా చర్చ జరిగింది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!
చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!
భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!
దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.